పెరిగిన బంగారు వెండి ధరలు


TV77telugu

బంగారం ధర పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం రేటు రూ.400 పెరుగుదలతో రూ.49.వేలకు చేరింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూవచ్చిన పసిడి రేట్లు ఈరోజు పైకి కదలడం గమనార్హం. వెండి కూడా కేజీకి రూ. 400 స్థాయిలోనే పెరిగింది. దీంతో సిల్వర్ రేటు రూ. 72,700కు చేరింది. వెండి ధర కేవలం 2 రోజుల్లోనే రూ. 1200 పెరిగింది. ఏబీసీ బులియన్ గ్లోబల్ జనరల్ మేనేజర్ నికొలస్ ఫ్రాప్పెల్ మాట్లాడుతూ బంగారం ధరకు బలహీనమైన ఈక్విటీ మార్కెట్లు, భౌగోళిక ఉద్రిక్తత పరిస్థితుల వల్ల మద్దతు లభిస్తోందని తెలిపారు. అయితే అదేసమయంలో క్రూడ్ ధరలు తక్కువగా ఉండటం, పదేళ్ల బాండ్ ఈల్డ్ పెరగడం (2018 నుంచి చూస్తే గరిష్ట స్థాయికి) వంటి అంశాలు పసిడిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించారు. బ్యాంక్కస్టమర్లకు గుడ్ న్యూస్.ఇకపై 24 గంటలూ తెరిచే ఉంటాయి!మరోవైపు బంగారం ధరలు పెరుగుతూ పోతుండటం, కోవిడ్ 19 వల్ల కొనుగోళ్లు తగ్గడంతో గోల్డ్ కాయిన్స్, బంగారు బిస్కెట్లకు ఆదరణ తగ్గిపోయింది బంగారం సురక్షితమైన ఇన్వెస్ట్ మెంట్ సాధనం అయినప్పటికీ చాలా మంది బంగారంలో ఇన్వెస్ట్ చేయడంలేదు. ఈ నేపథ్యంలో బంగారు నాణేలు, బిస్కెట్లు తయారు చేసే వారు, జువెలర్స్ కొత్తగా 0.5 గ్రాము గోల్డ్ బార్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. తక్కువ పరిమాణం వల్ల తక్కువ ధర అవుతుంది. దీని వల్ల ప్రజలు వీటిని కొనుగోలు చేస్తారని భావిస్తున్నారు. ఇంకా ఓరోపాకెట్ అనే ఫిన్ టెక్ సొల్యూషన్ సంస్థ తాజాగా సరి కొత్త ఫీచర్ నుఅందుబాటులోకి తీసుకువచ్చింది. డ్యూయెల్ వాల్ట్ సిస్టమ్ తీసుకువస్తున్నట్లు వెల్లడిచింది. అంటే ఒక యూకే వాల్ట్, ఒక ఇండియన్ వాల్ట్ ఉంటాయి. వీటి ద్వారా యూజర్లు వారి బంగారం లేదా వెండిని సులభంగానే ఇంటికి డెలివరీ పొందొచ్చు. డిజిటల్ గోల్డ్ను సులభంగా ఫిజికల్ గోల్డ్గా మార్చుకోవచ్చు. అలాగే డెలివరీ సురక్షితంగా ఉండేందుకు దీనికి ఇన్సూరెన్స్ కూడా అందిస్తున్నారు.