జగన్ సర్కార్ తగ్గేది లే


 TV77తెలుగు అమరావతి:

జగన్ సర్కార్ దూకుడు పెంచింది.( 2017–18 ) ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లు కేంద్రం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని. ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇవ్వాలని కోరుతూ కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదన పంపాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరింది. నిధులిస్తేనే ప్రాజెక్టు పూర్తిచేయడం సాధ్యమవుతుందనే అంశాన్ని కేంద్రానికి గట్టిగా చెప్పాలని విజ్ఞప్తి చేసింది. పీపీఏ బుధవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులు వివరించారు. ప్రణాళిక మేరకు పనులు జరుగుతుండటంపై పీపీఏ సంతృప్తి వ్యక్తం చేసింది. నిర్వాసితుల పునరావాసం, భూసేకరణకే రూ.30 వేల కోట్లు అవసరమని.(2017–18) ధరల ప్రకారం నిధులిస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యమవుతుందని అధికారులు చెప్పారు. దీనిపై తాము వెలిబుచ్చిన సందేహాలను నెలాఖరులోగా నివృత్తి చేస్తే ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామన్న పీపీఏ సీఈవో సూచనకు రాష్ట్ర అధికారులు అంగీకరించారు. గతేడాది జరిగిన సమావేశంలో కేంద్రానికి ప్రతిపాదన పంపడానికి పీపీఏ అంగీకరించిన విషయాన్ని గుర్తు చేసింది.తక్షణమే ఆ ప్రతిపాదన పంపి. నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. సీడబ్ల్యూసీ ఇదే అంశంపై కేంద్రానికి ఇప్పటికే నివేదికలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో రూ.2,100 కోట్లను తక్షణమే రీయింబర్స్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూస్తే గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.