అడవి ఉడుము అని పట్టుకున్నారు తీర అది మొసలి
iraila 22, 2021
TV77తెలుగు రాజమహేంద్రవరం:
తూర్పు గోదావరి జిల్లా. రాజమహేంద్రవరం
అడవి ఉడుము ని భావించి కర్రతో కొట్టి
సంచిలో వేసుకుని స్నేహితులకు తెలియజేసి వాటాలు వేసుకొని తినవచ్చని సమాచారం ఇచ్చి దానిని తీసుకువచ్చి వాటాలు వేసుకోవడానికి సంచి నుంచి బయటికి తీసేసరికి అది తీరా మొసలి. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున కాతేరు గామాన్ బ్రిడ్జి అవతల రెల్లి గడ్డ లంకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కాతేరు కు చెందిన ఒక రైతు బుధవారం తెల్లవారుజామున రెల్లి గడ్డ లంకలోకి పశువులకు మేత వెయ్యటానికి మకం వద్దకు వెళ్ళాడు. అక్కడ మొసలి పశువుల కొట్టం వద్ద సంచరిస్తుంది. అడివి ఉడుము అని భావించి కర్రతో ముఖము పై బాదాడు. వెంటనే సంచులో మొసలిని మూటకట్టి బైక్పై వేసుకుని స్నేహ తులకు సమాచారం ఇచ్చాడు. దాంతో ఆ స్నేహితులు అడివి ఉడుము మాంసం వాటా లేసుకుని మంచి విందు ఆరగించి చాలని కోరికతో ఉన్నారు. దానిని గ్రామం వద్ద బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చి సంచి విప్పే సరికి తెల్లవారిపోయింది. తీర అది చూస్తే మొసలి. వెంటనే వారు ఆ ముసలి మూతికి తాడుతో కట్టి త్రీటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాణాలతో ఉన్న ఆ మొసలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
ఈక్కడికి ఎలా వచ్చింది. వరదలకు కొట్టుకుని వచ్చిందని భావిస్తున్నారు. వాటి సంతతి ఇంకా ఈ గోదావరిలో ఉన్నట్లయితే జంతువులు మనుషుల ప్రాణాలకు హాని కలుగుతుందని భయపడుతున్నారు.