బైక్ ఆర్టీసీ బస్సు ఢీ

TV77తెలుగు అదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో తాతా, మనవరాలు మృతి.నేరడిగొండ మండలంలోని వాంకిడి సమీపంలో బైక్,ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నిర్మల్‌కు చెందిన తాతా,మనవరాలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను నిర్మల్‌కు చెందిన బచ్చన్ సింగ్ (60) రితిక( 4)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.