బస్సు, కంటైనర్ ఢీ 20 మందికిపైగా గాయపడ్డారు
iraila 06, 2021
TV77తెలుగు సిద్దిపేట:
జిల్లాలోని ప్రజ్ఞాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు,కంటైనర్ ఢీకొన్నాయి.దీంతో 20 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.