మద్యం సేవించి ప్రమాదాలు చేస్తున్న కార్పొరేషన్ అధికారుల డ్రైవర్లు
కొరవడిన అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం
గుట్టుచప్పుడు కాకుండా కార్లకు మరమ్మతులు
రాజకీయ నేతల సిఫార్సులతో ఇబ్బంది పడుతున్న అధికారులు
TV77తెలుగు రాజమహేంద్రవరం :
రాష్ట్ర ప్రభుత్వం మధ్య నిషేధం కోసం కృషి చేస్తుండగా దానికి విరుద్ధంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల కార్ల డ్రైవర్లు మద్యం సేవించి ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ అధికారుల ప్రాణాలకు. ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తుంది. నిధులు కొరత లేమి వల్ల ప్రభుత్వ డ్రైవర్ల ఖాళీలు భర్తీ లేకుండా కాంట్రాక్టు విధానంలో అరకొర జీతాలతో డ్రైవర్లను నియమించుకుని అధికారుల ప్రాణాలకు పణ్ణఅంగా పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్ల క్రితం రాజమండ్రి కార్పొరేషన్లో ఎలక్ట్రికల్ కార్లను ప్రవేశపెట్టి ప్రైవేటు వ్యక్తులను డ్రైవర్లను నియమించుకున్నారు. అయితే వీరికి ఎటువంటి ప్రభుత్వ నియమ, నిబంధనలు క్రమశిక్షణ, జవాబుదారితనం లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైవర్లు డ్యూటీలో ఉండగా మద్యం సేవించడం , అధికారులను పలు కార్యక్రమాలకు తీసుకెళ్లి, తీసుకురావడం మామూలే. అయితే అధికారులకు డ్యూటీ లేనప్పుడు, డ్యూటీ ముగిసిన తర్వాత సంబంధిత కార్లను కార్పొరేషన్ ఆవరణలో నిలిపి ఉంచాల్సి ఉంది . డ్రైవర్లు అందుకు విరుద్ధంగా అధికారుల అనుమతి లేకుండా, వారి ప్రైవేట్ అవసరాలకు తీసుకెళ్తూ రోడ్లపై ప్రమాదకరంగా రేష్ డ్రైవింగ్ చేస్తూ, కార్లను ప్రమాదాలకు గురి చేయడంతో పాటు ప్రజలను గాయాలపాలు చేస్తుండడం వీరికి నిత్యకృత్యంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక డ్రైవర్ మద్యం సేవించి కారు నడపడం తో ఒక అధికారి అతన్ని డ్యూటీ నుంచి తప్పించడం జరిగింది. ఈ సంఘటనను గుణపాఠంగా తీసుకోకుండా అధికారులు, డ్రైవర్లు ఇరువర్గాలు ఉదాసీనంగా వ్యవహరించడం పై విమర్శలు వస్తున్నాయి . మరో డ్రైవర్ అదే నిర్లక్ష్యంతో ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం AP39AD6170 నెంబర్ గల కారు నడుపుతున్న డ్రైవర్ మద్యం సేవించి, రేష్ డ్రైవింగ్ చేస్తూ, రద్దీగా ఉండే రాజా థియేటర్ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న బారికేడ్లను, ప్లాస్టిక్ డ్రమ్స్ లను ఢీకొట్టి కారుకు నష్టం కలిగించడం జరిగింది. మద్యం సేవించిన డ్రైవర్ పరిస్థితి గమనించిన స్థానిక ప్రజలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు లేదంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన కారు ను గుట్టుచప్పుడు కాకుండా మరమ్మతులు చేయించారని ,ప్రమాద సంఘటన పై అధికారులకు సమాచారం ఇవ్వ లేదని విమర్శలు వస్తున్నాయి. డ్రైవర్లు మద్యం సేవించి ప్రభుత్వ వాహనాల్లో అధికారులను తీసుకు వెళ్లడం పలు విమర్శలు వస్తున్నాయి. కాంటాక్ట్ డ్రైవర్ల పై చర్యలు తీసుకునే అధికారం లేకపోవడంతో అధికారులు సైతం ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేక పోతున్నారని తెలుస్స్తోంది గతంలో ఒక డ్రైవర్ ను మద్యం సేవించడనే కారణంతో డ్యూటీ నుండి తీసివేయగా, ఒక ప్రజా ప్రతినిధి అధికారులకు ఫోన్ చేసి ఆ డ్రైవర్ను డ్యూటీ లోకి తీసుకోవాలని సిఫార్సు చేయడంతో రాజకీయ అండతో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేషన్ అధికారి ఒకరు వాపోయారు. అధికారుల ప్రాణాలకు ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్న మద్యం డ్రైవర్ల పై చర్యలు తీసుకోవాలని, అధికారుల సక్రమంగా పర్యవేక్షణ చేయాలని ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి.