ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ బిల్లులు పెరగడానికి కారణం ఇదే..సజ్జల ప్రశ్నించారు
iraila 01, 2021
TV77తెలుగు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వాకం వల్లే విద్యుత్ సవరణ బకాయిల భారం వినియోగదారులపై పడుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు ఆరోపించారు.ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ. హయాంలో అడ్డగోలుగా ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్లే విద్యుత్ బకాయిల భారం పడుతోందన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల పాలు చేసి అప్పగించారని, ఉన్న అప్పులకు ప్రస్తుతం ఏడాదికి రూ.30 వేల కోట్ల వరకు వడ్డీగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు మాత్రమే అవుతోందని, ఇంత తక్కువ టైంలో ఎక్కడైనా అభివృద్ధి ప్రాజెక్టులు వస్తాయా అని సజ్జల ప్రశ్నించారు.వచ్చే ఎన్నికల నాటికి ఈ విషయంలో ఖచ్చితంగా పురోగతి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.రచ్చబండ కార్యక్రమానికి తేదీ ఇంకా ఖరారు కాలేదని, సెప్టెంబరు చివర్లో,లేదా అక్టోబరు మొదట్లో ప్రారంభం కావొచ్చని వెల్లడించారు.ఇక,అనర్హులకు అందకూడదనే ఉద్దేశంతోనే ఏ నెల పింఛను ఆ నెలలోనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సజ్జల వెల్లడించారు.కొందరు వేరొక రాష్ట్రంలో నివసిస్తూ ఎప్పుడో 2, 3 నెలలకు ఓసారి ఇక్కడకు వచ్చి పింఛన్లు తీసుకుంటున్నారని తెలిపారు. దీని వల్ల అర్హులు ఎవరో, అనర్హులు ఎవరో తెలియడం లేదన్నారు.పైగా 3 నెలలకు ఓసారి పింఛను ఇస్తే అవినీతికి ఆస్కారం ఉంటుందని వివరించారు.పింఛన్లలో పొరపాట్లను సరిచేయడానికే నూతన విధానం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు...