నెల్లూరు జిల్లాలో మాక్కవ్ పక్షుల స్మగ్లింగ్

TV77తెలుగు నెల్లూరు: మాక్కవ్ పక్షుల స్మగ్లింగ్ కలకలంరేపింది.తడ చెక్ పోస్టు దగ్గర SEB అధికారులు శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. ఓ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీలు నిర్వహించారు.కారులో పక్షులు కనిపించడంతో అవాక్కయ్యారు.ఈ క్రమంలో విజయవాడ నుంచి చెన్నైకు ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న 8 గ్రీన్ వింగ్ మక్కవ్ పక్షులను అధికారులు పట్టుకున్నారు.వీటి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.పక్షులను స్వాధీనం చేసుకున్న సెట్ అధికారులు వాటిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం.అలాగే గంజాయిని తరలిస్తుండటంతో SEB అధికారులు నిఘా పెంచారు.అన్ని జిల్లాల సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ మద్యం, గంజాయి,డబ్బులు,బంగారం,వెండి కూడా పట్టుబడుతున్నాయి.డబ్బులు,బంగారం,వెండికి సంబంధించి డాక్యుమెంట్లు లేకపోతే సీజ్ చేస్తున్నారు.