ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం రాత్రిపూట కర్ఫ్యూ
iraila 02, 2021
TV77తెలుగు అమరావతి:
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూను కొనసాగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులు తెలిపిన వివరాలను పరిశీలించిన ఆయన రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించారు.రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించాలని నిర్దేశించారు. కర్ఫ్యూ ఎత్తివేతకు మరికొంతకాలం వేచిచూద్దామని పేర్కొన్నారు.కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని,రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. వినాయకచవితి ఉత్సవాలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించరాదని,చవితి ఉత్సవాలను ఇళ్లకు పరిమితం చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనాలు,ఊరేగింపులను అనుమతించరాదని సీఎం జగన్ స్పష్టం చేశారు.